Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

స్కైరూట్ ప్రతినిధులతో రేవంత్ భేటీ

Author MANA VISHWAM | 28 Jul 2026, 10:01 PM | NATIONAL
స్కైరూట్ ప్రతినిధులతో రేవంత్ భేటీ

​తెలంగాణలో ఏరోస్పేస్, స్పేస్‌టెక్ రంగానికి పూర్తి సహకారం

​విక్రమ్-1 విజయాన్ని వివరించిన సంస్థ వ్యవస్థాపకులు

అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ సి.ఇ.ఒ పవన్ కుమార్ చందన, సి.ఒ.ఒ భరత్ డాకాలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధి, పెట్టుబడులు, పరిశోధనలపై ఇరువర్గాలు సుదీర్ఘంగా చర్చించాయి.


​చారిత్రాత్మక విజయం సాధించిన 'విక్రమ్-1'

ఇవి కూడా చదవండి

​భారత ప్రైవేటు రంగానికి చెందిన తొలి ఆర్బిటల్-తరగతి రాకెట్ 'విక్రమ్ -1' ను విజయవంతంగా ప్రయోగించిన తీరును స్కైరూట్ ప్రతినిధులు సిఎంకు వివరించారు.
​ఈ ప్రయోగంతో అమెరికా, చైనాల తర్వాత ప్రైవేటు రంగంలో ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన 3వ దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు.
​స్కైరూట్ సాధించిన విజయంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్ఠను పెంచడమే కాకుండా యువ పారిశ్రామికవేత్తలకు ఇది ఎంతో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.


​ఐటి, స్పేస్‌టెక్‌కు గమ్యస్థానంగా తెలంగాణ

​తెలంగాణలో ఉన్న అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, అత్యాధునిక తయారీ వాతావరణంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
​"రాష్ట్రంలో స్పేస్‌టెక్, ఏరోస్పేస్ రంగాల్లో పరిశోధన కేంద్రాలు, తయారీ యూనిట్ల స్థాపనకు పూర్తి స్థాయిలో మద్దతునిస్తాం. యువతకు అధునాతన సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే మా లక్ష్యం."
— రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

​ప్రభుత్వం, ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడం ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ స్పేస్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దడానికి చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.