​మణిపూర్‌లో ఉగ్రఘాతుకం: ఇద్దరు జవాన్ల వీరమరణం

​ఉఖ్రుల్‌లో అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై దాడి ​ఐఈడీ పేల్చి, కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ​పలువురికి గాయాలు.. అడవుల్లో ముమ్మర గాలింపు ​ మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఉఖ్రుల్‌ జిల్లాలో సోమవారం అస్సాం రైఫిల్స్‌ జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన మెరుపు దాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ​భద్రతా దళాల కథనం ప్రకారం... ఉఖ్రుల్‌ జిల్లాలో విధుల్లో ఉన్న అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌ కదులుతుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ముందుగా అత్యంత శక్తిమంతమైన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌)ను పేల్చారు. ఆ వెంటనే జవాన్లపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఆకస్మిక దాడితో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా...