హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సంబంధించిన కోర్టు ధిక్కరణ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన నేపథ్యంలో రంగనాథ్ స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
లోతుకుంట భూముల వివాదం కేసు విచారణ సందర్భంగా గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా వివాదాస్పద స్థలంలో యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘనేనని హైకోర్టు పేర్కొంది. అధికారులు న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టబద్ధ పాలనకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
లోతుకుంట భూముల వివాదం కేసు విచారణ సందర్భంగా గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా వివాదాస్పద స్థలంలో యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘనేనని హైకోర్టు పేర్కొంది. అధికారులు న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టబద్ధ పాలనకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.